Thursday, May 9, 2024
- Advertisement -

” కెసిఆర్ ఒక పిచ్చోడు “

- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హన్మకొండ జిల్లా ఏర్పాటును నిరసిస్తూ జరుగుతున్న నిరసనల్లో పాల్గొనేందుకు అక్కడికి వెళ్లిన సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సర్వే మాట్లాడుతూ దుయ్యబట్టారు.

సీఎం కేసీఆర్ ఒక గజిని అని – ఆయనకు మతిమరుపులు ఎక్కువని – రాత్ గయా.. బాత్ గయా అన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంటుందన్నారు. పిచ్చోని చేతిలో రాయి .. కేసీఅర్ చేతిలో అధికారం అన్నట్లుగా పరిస్థితి ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ క్షణికావేశంలో వచ్చిన సీఎం అని – ముఖ్యమంత్రి పదవి ఆయనకు ఇప్పుడు కోతికి కొబ్బరికాయలా దొరికిందన్నారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటాడో అర్థం కాని పరిస్థితి ఉందని సర్వే ఎద్దేవా చేశారు.పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు విభజిస్తే కాంగ్రెస్ సమర్థిస్తుందని అయితే ప్రజల అభీష్టం మేరకే ఉండాలని సర్వే డిమాండ్ చేశారు.

ప్రజలకిష్టం లేకపోయినా స్వార్థ రాజకీయాల కోసం బలవంతంగా జిల్లాలు ఏర్పాటు చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. పవిత్ర యాదగిరిగుట్టకు ఆంధ్రా పేరైనా యాదాద్రిగా నామకరణం చేశారని అంతేకాకుండా ఎవరు కోరుకోకున్నా యాదాద్రి జిల్లాగా ఏర్పాటు చేయబోతున్నారని ఆరోపించారు. యాదాద్రి జిల్లా ఏర్పాటు కేవలం సీఎం సమీప బంధువుల కోసమే తప్ప ప్రజల కోసం కాదని అన్నారు. జిల్లా ఏర్పాటు ప్రతిపాదనకు ముందే వారి బంధువులకు సమాచారం ఇవ్వడంతో యాదగిరిగుట్ట సమీపంలో వేల ఎకరాల భూములను ఆయన సమీప బంధువైన రామేశ్వర్ రావు – మరికొంత మంది కొనుగోలు చేశారని కేవలం వారి భూముల కోసమే యాదాద్రి జిల్లా ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు. 

Related

  1. రాజీనామా చేస్తా – కెసిఆర్
  2. వై ఎస్ రాజశేకర్ రెడ్డి చెల్లికి అన్యాయం చేస్తున్న కెసిఆర్
  3. కెసిఆర్ దెబ్బకి మీడియా నోరు మూస్కుంది
  4. కెసిఆర్ vs చంద్రబాబు
  5. మోడీ ని వశం చేసుకుంటున్న కెసిఆర్ ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -