ప్రపంచంలో కొన్ని వింత సంఘటనలు చోటుచేసుకుంటుటాయి.ఇవన్నీ కూడా దేవుడి లీలేనని ప్రజలు నమ్ముతుంటారు.అలాంటి విచిత్రమైన సంఘటనే ఇప్పుడు చోటు చేసకుంది. చోటు చేసుకున్న ఈవింతసఘటన అక్కడ వైరల్గా మారడంతో దాన్ని చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు.
అసలు విషయానికి వస్తే చూడటానికి మనిషి ముఖంలా కనిపిస్తున్న ఆకారంతో జన్మించిన ఆవు దూడకు ఓ గ్రామ ప్రజలు పూజలు చేస్తున్నారు.ఇది ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో చోటు చేసుకుంది ఈ వింత సంఘటన.హిందూవులు గోవును ఆరాధిస్తారన్న విషయం తెలిసిందే. అచ్చూ మనిషిలాగే ఉండే చెవులు, ముక్కు, కళ్లతో ఉన్న దూడకు ఓ ఆవు జన్మనిచ్చింది.
మనిషి పోలికలతో ఆవు దూడ జన్మించిన విషయం గ్రామంలో అగ్నిలా వ్యాపించింది. దీంతో జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకుని దూడను చూసేందుకు ఎగబడ్డారు.పుట్టిన మూడు గంటలకే దూడ చనిపోవడంతో దాని కలేబరాన్ని ఆరంజ్ దుప్పటిపై ఉంది పూజలు చేయడం మొదలు పెట్టారు.
{loadmodule mod_custom,GA2}
మనిషి పోలీకలతో దూడ జన్మించడంపై మాట్లాడిన తల్లి ఆవు యజమాని రాజా మిశ్రా.. తమ కొట్టంలో ఈ ఘటన జరగడం ఆ దేవుడి మాపై ఉందనడానికి నిదర్శనమని అన్నాడు.మరణించిన దూడకు అంత్యక్రియలు పూర్తి చేసి … త్వరలో దూడకు ఓ గుడి కూడా కట్టిస్తామని తెలిపాడు. ఈ ఘటనపై స్పందించిన జంతు నిపుణులు దాని చుట్టూ అల్లుతున్నవి మూఢ నమ్మకాలని కొట్టిపారేశారు.
{loadmodule mod_sp_social,Follow Us}