మన దేశంలో మహిళా భద్రతపై ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసిన.. స్త్రీలపై హింస రోజు రోజుకి పెరుగుతునే ఉంది. అతడో డాక్టర్ మరో డాక్టర్ను వివాహం చేసుకున్నాడు. ఇద్దరూ వైద్యులే కావడంతో కొంతకాలం కాపురం సజావుగానే సాగిందే. కానీ ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. డాక్టర్ శాడిస్టులా మారాడు. నిత్యం తన భార్యను ఏదో రకంగా వేధించసాగాడు. ఆమెను శారీరకంగా కూడా హింసించాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు అతడిపై హైదరాబాద్లోని కూకట్ పల్లి పీఎస్లో కేసు నమోదైంది.
విజయవాడకు చెందిన నిర్మాణ రంగ వ్యాపారి( Prestige Construction) నాడకుడితి నారాయణ మూర్తి కుమారుడు డాక్టర్ నవీన్ కాంత్కు .. ప్రియ అనే యువతితో వివాహమైంది. ఆమె కూడా డాక్టర్గా పనిచేస్తున్నారు. అయితే కొంతకాలం వీరి దాంపత్య జీవితం బాగానే సాగింది.
ఇటీవల నవీన్కాంత్ తరుచూ తన భార్య ప్రియను వేధించడం మొదలు పెట్టాడు. దీంతో ఆమె కూకట్పల్లి పీఎస్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు డాక్టర్ ఎన్ నవీన్ కాంత్, ఆయన తండ్రి నారాయణ మూర్తి, బ్రమరంబా సుధ రాణి, ఎన్ నళినీ కాంత్ పై కేసు నమోదు చేశారు. ఐపీఎస్ సెక్షన్ 498 ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Also Read
కళ్లముందే పులి ఇద్దరు ఫ్రెండ్స్ను చంపేసింది? అతను పరిస్థితి ఏంటంటే ..!