శంషాబాద్ ఎయిర్ పోర్టులో విషాదం చోటుచేసుకుంది. ప్లంబింగ్ పనులు చేస్తుండగా డ్రైనేజీ పైప్ లైన్ గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో లీకైన విషవాయువును పీల్చి ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు మృతిచెందాడు. శంషాబాద్ ఎయిర్పోర్టులోని ఎరైవల్ బ్లాక్లో ఈ ఘటన గురువారం చోటు చేసుకుంది. డ్రైనేజీ పైపులు మరమ్మత్తు చేస్తున్న సమయంలో ప్రమాదం చోటుచేసుకుంది.
ప్రైవేట్ ఏజెన్సీకి చెందిన ప్లంబర్లు నరసింహారెడ్డి(42), మరో ఇద్దరు జకీర్, ఇలియాస్ సరిచేసేందుకు వెళ్లారు. ముగ్గురు వ్యక్తులు ఈ డ్రైనేజీ పైపులు మరమ్మతు పనులలో నిమగ్నమయ్యారు. కాగా వారిలో ఒకరైన నర్సింహారెడ్డి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అప్రమత్తమైన అధికారులు వారిని ఎయిర్పోర్టులోని ఆస్పత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ నర్సింహారెడ్డి మృతిచెందగా.. జాకీర్, ఇలియాస్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. గ్యాస్ లీకేజీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రక్షణకు గార్డులు, కుక్కలు కాపలా.. వామ్మో ఆ మామిడి పండ్లకు ఇంత సెక్యూరిటా..!