Monday, May 20, 2024
- Advertisement -

విరుస్క జంట‌కు వినూత్న‌రీతిలో విషెస్ చెప్పిన డ్యూరెక్స్‌ కండోమ్ కంపెనీ….

- Advertisement -

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ తార అనుష్క శర్మ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది బంధువులు, స్నేహితులు సమక్షంలో ఒక్క‌ట‌య్యారు. వీల్లిద్ద‌రి పెళ్లి ఇట‌లీలో ఘ‌నంగా జ‌రిగింది. కోహ్లీ, అనుష్క తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా పెళ్లి ఫోటోలను పోస్ట్ చేశారు. ఇప్పటికే వేల మంది అభిమానులు రీట్వీట్‌ చేశారు.

జంట‌కు ప్ర‌ముఖులు తెలిపిన విషెస్‌తో సోష‌ల్ మీడియా నిండిపోయింది. వారితో పాటు కంపెనీలు, సంస్థ‌లు కూడా వారి అధికారిక ట్విట్ట‌ర్ ఖాతాల్లో విరుష్క జంట‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాయి. వాటిలో డ్యూరెక్స్ కండోమ్ కంపెనీ చేసిన ట్వీట్ ప‌లువురిని ఆక‌ర్షిస్తోంది.

ఒక ప‌క్క విరుస్క జోడీకీ విషెస్ చెబుతూనే, మ‌రో ప‌క్క త‌మ బ్రాండింగ్‌ని ప్ర‌చారం చేసుకుంటూ ఆ కంపెనీ చేసిన ట్వీట్‌ను చూసి నెటిజ‌న్లు ప‌గ‌ల‌బ‌డి న‌వ్వుతున్నారు. కంపెనీ తెలివితేట‌ల‌కు మెచ్చుకుంటున్నారు.

‘కంగ్రాచ్యులేష‌న్స్‌… విరాట్‌, అనుష్క‌… మీ మ‌ధ్య‌కు దేన్ని అడ్డురానీయ‌కండి.. ఒక్క డ్యూరెక్స్ మిన‌హా’ అని రాసి ఉన్న ఫొటోను కంపెనీ ట్వీట్ చేసింది. దీనిపై కొన్ని ఫ‌న్నీ కామెంట్ల‌ను కూడా నెటిజ‌న్లు చేశారు. ఉద‌యం 6 గం.ల నుంచి రాత్రి 10 గం.ల వ‌ర‌కు కండోమ్ ప్ర‌క‌ట‌న‌ల మీద ప్ర‌భుత్వం నిషేధం విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యాన్ని వారు గుర్తుచేసి న‌వ్వులు పూయించారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -