ఈ మధ్య కాలంలో తెలంగాణలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ పేరు మారు మ్రోగుతోంది. ఆయనకు ఏకంగా సన్మానాలు కూడా చేశారు. ఇప్పుడు సీఎం, హోం మినిస్టర్, ప్రతిపక్ష నాయకుడు స్థాయి సెక్యూరిటీని ఏర్పాటు చేశారు.
ఓటుకు నోటు స్కాం లో నిజాయితీగా స్టీఫెస్సన్ వ్యవహరించారని తెలంగాణ ప్రాంతమంతా ప్రశంసలతో ముంచెత్తుతోంది. ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ కార్, రౌండ్ ద క్లాక్ ఆర్మ్డ్ గార్డ్స్, ఎనిమది మంది గన్మెన్స్, ఎనిమది మంది వ్యక్తిగత అధికారులు మరియు ఎస్కార్ట్ పోలీస్ వెహికల్స్ ను ఏర్పాటు చేశారు.
సీనియర్ సిటీ వింగ్ అధికారులు చెప్పిన ప్రకారం ఎవరికైనా ప్రాణాపాయం ఉంది అని తెలిసినప్పుడు మేం ఈ సెక్యూరిటిని ప్రొవైడ్ చేస్తాం. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం స్టీఫెన్సన్ ఓటుకు నోటు స్కాంలో సీరియస్ థ్రెట్ ఉంది అని సమాచారం మేరకు ఈ సెక్యూరిటీని ప్రొవైడ్ చేశామని పేర్కొన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా సెక్యూరిటీ వెహికల్స్, బుల్లెట్ ఫ్రూఫ్ కార్ మరియు గన్మెన్స్ తో కూడిన సెక్యూరిటీ వెంట వెళుతుంది. అలాగే ఆయన ఇంటి దగ్గర కూడా ఇద్దరు గార్డ్ని షప్ట్ల ప్రకారం ఏర్పాటు చేశాం. ఏ ఎమ్మెల్యేకి అయినా 2+2 తో కూడిన కామన్ సెక్యూరిటి ఉంటుంది. కాని థ్రెట్ ఉంది అన్న సమాచారం మేరకు ఈ సెక్యూరిటీని స్టీఫెన్సన్కు ప్రొవైడ్ చేశాం అన్నారు.
రేవంత్ రెడ్డి పుణ్యమా అని స్టీఫెన్సన్ సీఎం స్థాయిలో పేరొచ్చేసింది. అంతే సెక్యూరిటితో అనుభవిస్తున్నాడు.