Monday, May 13, 2024
- Advertisement -

ఇంద్రేశ్వర్‌ సెక్టార్‌లో ఉగ్రవాదులకు భద్రతాదళాల మద్య కాల్పులు!

- Advertisement -

కుక్క తోక వంకర అన్న చందంగా పాక్‌ వక్ర బుద్ధి మారడం లేదు. ఓ వైపు శాంతి మంత్రం జపిస్తూనే కాల్పులకు తెగబడుతున్నారు. తీర నియంత్రణ రేఖ వెంట కాల్పులు దిగుతూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది.  జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. షోపియాన్ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాదిని హతమార్చాయి భద్రతాబలగాలు. ఇక ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్లు తెలుస్తోంది. సుమారు నాలుగు గంటల పాటు పాక్‌ రేంజర్లు కాల్పులకు దిగారు. శుక్రవారం రాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము కాల్పులు కొనసాగాయి. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌) బెటాలియన్‌ సైతం సరైన సమాధానం ఇచ్చింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -