Wednesday, April 17, 2024
- Advertisement -

వుహాన్​లో నిపుణుల బృందం.. ఒక్క ప్రశ్న కోసం వెతుకులాట..!

- Advertisement -

కరోనా మహమ్మారి ఆవిర్భావంపై దర్యాప్తు కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) బృందం చైనాకు గురువారం రానున్నట్లు ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి ఝావో లిజియాన్ వెల్లడించారు. వుహాన్​లో నిపుణుల బృందం పర్యటించనున్నట్లు తెలిపారు. అక్కడే దర్యాప్తు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని వివరించలేదు.

చైనాలో పర్యటించేందుకు నెలల నుంచి ఎదురుచూస్తోంది డబ్ల్యూహెచ్​ఓ. పర్యటనకు అడ్డంకులు ఎదురవడం పట్ల సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ సైతం అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్పందించిన టెడ్రోస్.. తొలి కేసు ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంపై దర్యాప్తు చేయనున్నట్లు చెప్పారు.

కరోనావైరస్ చైనాలోనే ఉద్భవించిందనే ఆరోపణలను ఆ దేశం ఖండిస్తోంది. అదేసమయంలో దేశంలో జరుగుతున్న పరిశోధనలపై ఉక్కుపాదం మోపుతోంది. బయటినుంచే వైరస్ వచ్చిందని అర్థంలేని సిద్ధాంతాలను వల్లే వేస్తోంది.

టీకా తీసుకుంటున్న సమయంలో ఒత్తిడికి గురైన జో బైడెన్‌..!

వామ్మో.. ఒకే సారి భారతీయ రైల్వేలో ఇన్ని విభాగాలా..!

మెగా డ్రిల్​​.. సముద్రంలో ట్రోపెక్స్ విన్యాసాలు..!

తెలుగు తెరపై సీతమ్మలు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -