ఏ ఆలోచన అయినా.. ఏ ఉద్యమం అయినా ఒక్కరితోనే మొదలవుతుందన్నది నిజం. తిరుగుబాటు కూడా ఒక్కడితోనే స్టార్ట్ అవుతుంది. తర్వాత అంతా ఆ వ్యక్తి వెనక నడుస్తారు. ప్రపంచ చరిత్రలో జరిగిన ప్రతిపరిణామం వెనక ఒక్కడి ఆలోచన.. ఒక్కడి తిరుగుబాటు ఉంటుంది. తాజాగా ముంబైకి చెందిన ఓ యువకుడు లేవనెత్తిన అంశం ఇప్పుడు అందరినీ ఆలోచనలో పడేసింది. ఆ యువకుడు మాటలకు సోషల్ మీడియా మొత్తం ఫిదా అయిపోయింది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ప్రస్తుతం ముంబైలో లోకల్ ట్రైన్స్ అందుబాటులో ఉన్నా అందులో సామాన్యులు ప్రయాణించేందుకు అవకాశం లేదు. కేవలం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ప్రయాణించే అవకాశం ఉంది. అయితే తాజాగా ఓ యువకుడు నిబంధనలకు విరుద్ధంగా లోకల్ ట్రైన్ ఎక్కాడు. దీంతో అతడిని రైల్వే సిబ్బంది పట్టుకొని వెంట తీసుకెళ్లారు. ఆ సమయంలో ఆ యువకుడు సెల్ ఫోన్ లో వీడియో తీశాడు. అది సోషల్ మీడియాలో పెట్టడంతో ఇప్పుడా వీడియో వైరల్ గా మారింది. ఇంతకీ ఆ యువకుడు ఏమన్నాడంటే..
నాకు గత ఏడాది వరకు ఉద్యోగం ఉండేది. నెలకు రూ. 35000 సంపాదించేవాడిని. కానీ కరోనా లాక్డౌన్ తో నా ఉద్యోగం పోయింది. తీవ్రంగా ప్రయత్నిస్తే ఇటీవలే నాకు ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే ట్రైన్లో వెళ్లే అవకాశం ఉంది. కానీ నా లాంటి వేలాది మందికి లోకల్ ట్రైన్స్ ఆధారం. నన్ను ఏం చేయమంటారు’ అంటూ సదరు యువకుడు ప్రశ్నించాడు. అంతేకాక రైల్వే అధికారులకు ఫైన్ కూడా కట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. సదరు యువకుడు లేవనెత్తిన అంశం కరెక్టెనంటూ నెటిజన్లు అతడితో గొంతుకలుపుతున్నారు.
Also Read: వధువుపై ముద్దుల వర్షం.. షాక్ అయిన పెళ్లి కొడుకు..!