ఫేస్బుక్లో ఒక వార్త జర్నలిస్ట్ ప్రాణాలు తీసింది. తనకు వ్యతిరేఖంగా వార్త రాసి అది ఫేస్బుక్లో పోస్ట్ చేసినందుకు ఓ మంత్రి హత్య చేయించాడని వార్తలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సమాజ్వాద్ పార్టీకి చెందిన మంత్రిపై అనేక ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటికి సమాధానం చెప్పాలని జగేందర్ సింగ్ అనే జర్నలిస్ట్ వార్తను ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు.
ఇది తెలుసుకున్న ఆ మంత్రి సదరు జర్నలిస్ట్ను పిలిచి వార్న్ంగ్ ఇప్పించారట. అయినా ఆ జర్నలిస్టు లొంగిపోకుండా మళ్ళీ దానికి సంబంధిచిన తాజా సమాచారాన్ని పోస్ట్ చేయడంతో హత్యకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని షహజాన్పూర్లో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. తమకు పోలీసులపై నమ్మకం లేదని సిబిఐ విచారణ జరిపించాలని జర్నలిస్టు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.