Wednesday, May 15, 2024
- Advertisement -

పవన్ కు పరిటాల రవి గుండు కొట్టించడం వెనక అసలు నిజం ఇదే

- Advertisement -

అప్పట్లో సినీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కి పరిటాల రవి గుండు కొట్టించాడనే వార్తలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఇక పవన్ కు గుండు కొట్టించడంపై ఇప్పటికి రకరకల వార్తలు వస్తునే ఉన్నాయి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గుండుకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అసలు విషయంలో వెళ్తే.. పరిటాల రవి ఆత్మకథ అస్తమించని రవి పుస్తకంలో.. 177,178 పేజీల్లో పవన్ కళ్యాణ్ తో ఎలాంటి గొడవలు లేవని.. ఒకసారి ప్రసాద్ ల్యాబ్ లో ఓ వ్యక్తి ద్వారా పవన్ తో పరిచయం ఏర్పడిందని.. అలా పవన్ తో ఒక్కసారే మాట్లాడినట్లు తన ఆత్మకథలో వివరించారు.

మరి ఇంతా దారుణమైన పుకార్లు ఎందుకు వచ్చినట్లు.. గతంలో పరిటాల రవి ఇంటికి ఆనుకొని ఉన్న యాక్టర్ జగ్గారావుకు చెందిన స్థలాన్ని చిరంజీవి10లక్షలకు కొన్నాడట‌.. అందులో 7లక్షలు డబ్బులు ఇచ్చి మిగిలిన రూ. 3లక్షలు తరువాత ఇస్తానని చెప్పాడట చిరంజీవి. ఆ మూడు లక్షల విషయంలో వివాదం వచ్చింది. ఈ క్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ బాంబుపేలుళ్లు జరిగాయి. దీంతో భద్రత దృష్ట్యా మరింత సెక్యూరిటీ కోసం పరిటాల రవి ఆ స్థలాన్ని చిరంజీవిని తనకు అమ్మమని దానికి బదులుగా మాదాపూర్ లో ఎకరం ల్యాండ్ ఇస్తానని జగ్గారావుకు మూడు లక్షలు ఇచ్చి ఆ ఇష్యూని క్లియర్ చేశాడట. అయితే చిరు కుతూరికి, ఉదయ్ కిరణ్ కు జరిగే నిశ్చితార్దానికి మీడియాని అనుమతించలేదు.

అలా కొంతమంది జర్నలిస్ట్ లు గోడ చాటుగా ఫోటోలు తీయడంతో.. అది గమనించిన పవన్ వాళ్లని కొట్టాడట. అందులో నెల్లూరు వాసి అయిన‌ ఓ జర్నలిస్ట్.. పవన్ మీద కోపంతో.. ఈ గుండు కథను సృష్టించాడట. జగ్గారావు, చిరంజీవి వివాదంలో పరిటాలపై పవన్ దాడికి దిగాడని, కోపంతో రగిలిపోయిన పరిటాల.. పవన్‌కు గుండు కొట్టించాడని నెల్లూరు జిల్లానుంచి విడుదలయ్యే జమీన్ రైతు అనే పత్రిక ప్రింట్ చేసింది. దీనిపై ఎద్దు ఎత్తున ప్రచారం జరిగింది. ఇక పవన్ కు యాంటీ ఫ్యాన్స్ దీనిని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. సో పవన్ కళ్యాణ్ గుండ్ వెనక ఉన్న అసలు కథ ఇది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -