కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన సాగు చట్టాలను నిరసిస్తూ చేపట్టిన ఆందోళనలను ఉద్ధృతం చేశారు రైతులు. ఈ క్రమంలో దేశ రాజధాని ఢిల్లీ సమీప సరిహద్దుల్లోని టోల్ ప్లాజాలను మూసివేశారు. ఎలాంటి రుసుములు వసూలు చేయకుండా వాహనాలను పంపిస్తూ.. నిరసన తెలుపుతున్నారు.
శుక్రవారం అర్ధరాత్రి నుంచే ఢిల్లీ-హరియాణా సరిహద్దు కర్నాల్లోని బస్తారా టోల్ ప్లాజాను మూసివేసి.. వాహనాలను అనుమతిస్తున్నారు అన్నదాతలు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపారు. అలాగే.. అంబాలలోని శంభు టోల్ప్లాజాను కూడా మూసివేశారు.
శనివారం తెల్లవారుజామునే హిసార్-ఢిల్లీ ఎన్హెచ్-9 రహదారిపై ఉన్న మయ్యడ్ టోల్ప్లాజాను మూసివేశారు రైతులు. వాహనాలను ఎలాంటి ఫీజు చెల్లించకుండానే అనుమతిస్తున్నారు. ఈ టోల్ప్లాజా పంజాబ్, రాజస్థాన్లను దిల్లీతో అనుసంధానిస్తుంది. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.