మనం రోజు ఆకాశంలో చంద్రుడిని చూస్తునే ఉంటాం.కాని ఆదివారం రాత్రి మన చంద్రుడు కాస్తా వెరైటీ కనిపించాడు.అదేంటీ చంద్రుడు రోజు ఒకలాగే కనిపిస్తాడు కదా అనేగా మీ అనుమానం.అవునండీ కాకపోతే ఆ రోజు కొందరి భక్తులకి చంద్రుడులో సాయి బాబా రూపం కనిపించిందటా. చంద్రుడి రూపంలో ఉన్న సాయి బాబా రూపాన్ని కొందరు భక్తులు ఫోటోలు తీసి తమ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.దీంతో ఈ వార్తను నేషనల్ లేవల్లో ఫోకస్ చేశారు మన టీవీ వాళ్లు.అసలు చంద్రుడులో సాయి బాబా ఎలా కనిపిస్తాడని హెతువాదులు ప్రశ్నిస్తున్నారు.ఎవరి లెక్కులు వారికి ఉంటాయి అది వేరే విషయం అనుకోండి.మొత్తనికి చంద్రుడిలో సాయి బాబా కనిపించాడని చాలామంది నమ్మి పూజలు కూడా చేశారు.దీనిపై మన ఛానెల్స్ వారు పలు చర్చ వేధికలను కూడా మొదలెట్టారు.చాలామంది ఈ విషయాన్ని సరాదాగా తీసుకున్నారు.
ఇక కొందరు అయితే ఓ అడుగు ముందుకేసి మరి ..చంద్రుడిలో తమకు నచ్చిన వారు ఫోటోలను పెట్టి చంద్రుడిలో తమవారు కనిపించారు అని పోస్ట్లు చేయడం విశేషం.బాలకృష్ణ,బండ్ల గణేష్,బిగ్బాస్ కౌశల్లు చంద్రుడి రూపంలో కనిపించారని కొందరు సోషల్ మీడియాలో పోస్ట్లు చేయడం గమనర్హం. సాయి బాబా ఫోటోని చంద్రుడి రూపంలో ఎవరో గ్రాఫిక్స్ చేసి ఇలా చేశారని చాలామంది నమ్ముతున్నారు.వారు ఎవరో కనిపెట్టింది ఆద్యా మీడియా.ముంబైకి చెందిన ఓ ప్రముఖ గ్రాఫిక్స్ సంస్థ ఇలా సాయి బాబా ఫోటోని చంద్రుడి రూపంలో డిజైన్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో,ఈ ఫోటో బయటకి వచ్చింది.ఈ ఫోటోని పట్టుకుని మనవాళ్లు చంద్రుడిలో సాయి బాబా కనిపించాడని తెగ హడావిడి చేశారు.