- Advertisement -
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ గ్రౌండ్లోనే కాదు, సోషల్ మీడియాలో కూడా ఈజీగా సిక్స్లు కొడతాడన్న సంగతి అందరికి తెలిసిందే. సమాజంలో జరిగే వాటిపై ఎప్పటికప్పుడు స్పందిస్తుంటాడు ఈ మాజీ ఓపెనర్. తాజాగా భారతసైన్యం పాకిస్థాన్ తీవ్రవాదులపై జరిపిన దాడులపై స్పందించాడు సెహ్వాగ్.
తన ట్విట్టర్లో ఈ దాడులపై స్పందిస్తు… మన జవాన్లు గేమ్ బాగా ఆడారని, మన కుర్రాళ్లు చాలా చక్కగా ఆడారు అంటూ క్రికెట్ భాషలో ట్విట్ చేశాడు సెహ్వాగ్. సుధార్ జావో వర్మా సుధార్ దేంగే అనే హ్యాష్ ట్యాగ్ను జత చేశాడు. ఈ ట్విట్పై చాలామంది స్పందిస్తున్నారు. పూల్యామా దాడిలో మరణించిన జవాన్ల పిల్లలను తాను చదివిస్తానని ప్రకటించాడు సెహ్వాగ్.