- Advertisement -
సూడాన్ మాజీ ప్రధాని సాదిక్ అల్-మహ్ది.. కరోనా కారణంగా మృతిచెందారు. యూఏఈలో చికిత్స పొందుతున్న ఆయన 84ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. సూడాన్లో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకున్న చివరి ప్రధానిగా, దేశంలో అతిపెద్ద రాజకీయ పార్టీకి నాయకత్వం వహించిన నేతగా ఆయన గుర్తింపు పొందారు.
పాకిస్థాన్ విపక్షంలోని ముఖ్య నేత, పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ చీఫ్ బిలావల్ భుట్టో జర్దారీకి కరోనా పాజిటివ్గా తేలింది. ఆయన ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నారు.
ప్రపంచంపై కరోనా పంజా కొనసాగుతోంది. ఇప్పటివరకు 6,09,08,673 కేసులు బయటపడ్డాయి. మొత్తం మీద 14,30,367 మంది కరోనాకు బలయ్యారు. బ్రిటన్లో కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి.
వామ్మో.. పుష్ప లో తోమ్మిది మంది విలన్స్ అంటా..?
అవును మేమిద్దరం డేటింగ్ లో ఉన్నాం..!