- Advertisement -
కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత బూటా సింగ్ (86) తుది శ్వాస విడిచారు. రాజస్థాన్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన బూటా సింగ్.కేంద్ర హోం మంత్రిగా, బిహార్ గవర్నర్గా పనిచేశారు.
బూటా సింగ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం ప్రకటించారు. పేద, అణగారిన వర్గాల పక్షాన బూటా సింగ్ తన గొంతుక వినిపిచారన్నారు. ఆయన కుటుంబానికి, అనుచరులకు తన ప్రగాఢ సానుభూతిని ట్విట్టర్ ద్వారా తెలిపారు మోదీ.
జాతీయ ఎస్సీ కమిషన్ ఛైర్మన్గా కూడా బూటా సింగ్ పనిచేశారు. బూటా సింగ్ మృతితో ఆయన అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతి గురయ్యారు.