మెదక్ జిల్లా సంగారెడ్డిలో కోర్టు నుంచి ముగ్గురు ఖైదీలు పరారయ్యారు. పోలీసుల కళ్ళుగప్పి కోర్టు ఆవరణ నుంచి తప్పించుకున్నారు. అసలు మ్యాటర్లోకి వెళితే…
తరుణ్ బోస్లే, లక్ష్మన్ బోస్లే, పరమేశ్వర్, కైలాస్ అనే నలుగురు వ్యక్తులు కలిసి ఒక గ్యాంగ్ ముఠాగా తయారై ప్రజల మీద పడి అందినకాడికి దోచుకుంటున్నారు. దారి దాపిడి కాసి మొదటగా బెదిరిస్తారు. ఇవ్వకపోతే హత్య చేసి తీసుకెళ్తారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇళ్ళ మీద పడి దొంగతనాలు ఎన్నో చేసి బీభత్సం సృష్టించారు. చాలామంది ప్రజలను అతి కిరాతకంగా నరికి చంపారు.
ఇప్పుడు ఈ కరుడు కట్టిన ముఠా జైలు నుంచి తప్పించుకున్నారు. పోలీసులు ఎంత ప్రయత్నించినా దొరకలేదు. ఇద్దరు ఖైదీలను మాత్రమే పట్టుకోగలిగారు. వీరిని కోర్టుకు హాజరు పరుస్తుండగా ఈ సంఘటణ జరిగింది. పోలీసులు పది నెలల కిందట ఈ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. గత పదినెలలుగా బెయిల్ రాకపోవడంతో, పారిఫోవడానికి ఒక ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్లో భాగంగానే మొదట ఒక దొంగ పోలీసుల కళ్ళు గప్పి పరుగెత్తాడు. అతని కోసం పోలీసులు వెంబడించడంతో మిగిలిన వారు కూడా పరారయ్యారు. ఎలాగోల ఇద్దరిని పట్టుకున్నారు. మిగిలిన ఇద్దరూ పారిపోయారని సమాచారం.
{youtube}WzaPgdEhsOk{/youtube}