మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో డయాగ్నస్టిక్స్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. రెండేళ్ల క్రితం నారాయణగూడలో డయాగ్నస్టిక్స్ హబ్ ప్రారంభించినట్లు గుర్తు చేశారు. శ్రీరాంనగర్లో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్స్ కేంద్రాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 8 డయాగ్నస్టిక్స్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల్లో 57 రకాల పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నారు.
డయాగ్నస్టిక్స్ కేంద్రాలను క్రమంగా విస్తరిస్తాం. డయాగ్నస్టిక్స్ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చిన వైద్య సిబ్బందికి అభినందనలు. నగర ప్రజల తరఫున మంత్రి ఈటల, వైద్య సిబ్బందికి అభినందనలు. భవిష్యత్లో పట్టణ పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తాం. ఉచిత వైద్య పరీక్షల సేవలను పట్టణాలు, గ్రామాలకు విస్తరిస్తాం అని కేటీఆర్ తెలిపారు.
ఏపీ లో మరో అంతు చిక్కని వ్యాధి..21 మంది హఠాత్తుగా..!
రైతు పొలంలో అధ్బుతం.. రెక్కలతో బల్లి..