దేశం లోని నల్ల కుబెరులని బయటకి తీసుకుని వస్తాను అని మోడీ చేసిన వ్యాఖ్యలు నిజం కాకుండా పోతున్నాయి. ఒక పక్క సామాన్యుడు రెండువేల రూపాయల నోటు కోసం కష్టాలు పడుతుంటే తెగ బలిసిన వాడు మాత్రం బాత్ రూమ్ లలో దొంగ సొమ్ము దాస్తున్నారు.
కర్ణాటకలోనూ గోవాలోనూ ఐటి అధికారులు 15 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. హుబ్బలి చిత్రదుర్గు జిల్లాల్లోని కాసినో ఆపరేటర్లపై బులియన్ ట్రేడర్లపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలోని కర్ణాటకలోని హుబ్లీలో ఐటీ శాఖ అధికారులు ఓ హవాలా డీలర్ ఇంటిలో సోదాలు చేయగా దిమ్మతిరిగే ఆస్తులు వెలుగు చూశాయి.
సదరు డీలర్ కు చెందిన రహస్య బాత్రూంలో ఉన్న డబ్బును బంగారాన్ని చూసిన అధికారులు అవాక్కయ్యారు. రూ. 5.7 కోట్లు కొత్త నోట్లు రూ. 90 లక్షల పాత నోట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా 28 కిలోల బంగారాన్ని 4 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నల్లధనానికి సంబంధించి అధికారులు డీలర్ను విచారిస్తున్నారు. కాగా ఆ ఇల్లు ఓ సీనియర్ కన్నడ నటుడి బంధువుదని సమాచారం.