గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫుట్పాత్ల ఆక్రమణలు తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఫుట్పాత్లు లేకుంటే పాదచారులు గాల్లో నడుస్తారా అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. న్యాయవాది తిరుమలరావు పిల్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం… వెంటనే ఆక్రమణలు తొలగించాలని జీహెచ్ఎంసీ, పోలీసులకు ఆదేశించింది.
సర్వేచేసి ఫుట్పాత్లు లేని ప్రాంతాలను గుర్తించాలని… లేనిచోట నిర్మాణాలు చేపట్టాలని సూచించింది. ఫుట్పాత్లను పాదచారులు మాత్రమే ఉపయోగించేలా చూడాలని తెలిపింది. ఆక్రమణల తొలగింపు, ఫుట్పాత్ల నిర్మాణంపై 4 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. తమ ఆదేశాలు అమలు చేయకపోతే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించిన న్యాయస్థానం… తదుపరి విచారణను ఏప్రిల్ 15కి వాయిదా వేసింది.
అర్హతలున్న వారు చాలా మంది ఉన్నా వీరికే ఇచ్చా..!
మహేష్ మళ్ళీ సంక్రాంతికే ఎందుకు వస్తున్నట్టు?
అంతా నీ హయాంలోనే జరిగింది.. ఇప్పుడు పేలుతున్నావ్.. బాబుపై విజయసాయిరెడ్డి ఫైర్!