- Advertisement -
కొత్తగా ఎన్నికైన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయ లక్ష్మి, … ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ వారికి శుభాకాంక్షలు తెలిపారు. మేయర్, డిప్యూటీ మేయర్, తెరాస కార్పొరేటర్లు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. మేయర్గా అయ్యేందుకు అర్హతలున్న వారు చాలా మంది ఉన్నా… అందరికి అవకాశం ఇవ్వలేమని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
నగర వైభవం మరింత పెంచేలా కృషి చేయాలని కొత్త మేయర్, డిప్యూటీ మేయర్కు ముఖ్యమంత్రి సూచించారు. కొద్ది మందికే ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే అవకాశం వస్తుందని… దానిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంయమనం, సహనంతో సాదాసీదాగా వ్యవహరించాలన్న సీఎం… బస్తీల్లో పేదల కష్టాలు, గోసలను పరిష్కరానికి పాటుపడాలని నిర్దేశించారు.
అంతా నీ హయాంలోనే జరిగింది.. ఇప్పుడు పేలుతున్నావ్.. బాబుపై విజయసాయిరెడ్డి ఫైర్!