Sunday, May 19, 2024
- Advertisement -

మైసూరు హోమ్ స్టే లో హైటెక్ వేశ్యవాటికపై పోలీసుల రైడ్‌…

- Advertisement -

హైటెక్ వ్య‌పిచారం బ‌ట్ట‌బ‌య‌ల‌య్యింది.తెలంగాణా నుంచి అంద‌మైన అమ్మాయిల‌ను తీసుకొచ్చి వ్య‌పిచారాన్ని నిర్వ‌హిస్తున్నార‌ని పోలీసులు తెలిపారు.ప‌క్కా స‌మ‌చారంతో పోలీసులు దాడి చేసి 8మంది యువ‌తుల‌ను మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు పోలీసులు.

క‌ర్నాట‌క‌లోని హిరియపట్టణ – కోప్ప మార్గంలోని గిరుగూరు గ్రామం సమీపంలోని హోం స్టేలో హైటెక్ వేశ్యవాటికా కేంద్రం నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. హాసన్ కు చెందిన జగదీష్, సిద్దేష్, మల్లేష్, ఉమేష్ నాయక్, కుమారస్వామి, రజాక్, సాయికుమార్ అనే నిందితులను పోలీసులుఅరెస్టు చేశారు.
మల్లేష్, సాయికుమార్ ఇద్ద‌రు తెలంగాణ నుంచి అందమైన అమ్మాయిలను తీసుకు వచ్చి ఇక్కడ హైటెక్ వేశ్యవాటిక కేంద్రం నిర్వహిస్తున్నారని పోలీసులు తెలిపారు. తాము దాడి చేసే సమయంలో హోం స్టే వ్యవస్థాపకుడు వసంత్ తప్పించుకుని పారిపోయాడని, అరెస్టు చేసిన నిందితులను అందరిని కోర్టు ముందు నిందుతుల‌ను హాజరుపరిచారుపోలీసులు. దాడి సంయంలో పారిపోయిన హోం స్టే వ్యవస్థాపకుడు వసంత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -