నేటి సమాజంలో భార్య ,భర్తల మధ్య సంబంధాలు సరిగా లేవని అందరికి తెలిసిందే.వేరే అమ్మాయిల మోజులో పడి భార్యలను వదిలేస్తున్న భర్తలు ఉన్నారు.వేరే మగాడితో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తలను చంపేస్తున్న భార్యలు కూడా ఉన్నారు.తాజాగా ఇటువంటి సంఘటనే ఒకటి జరిగింది.వేరే అమ్మాయి మోజులో పడి భార్యను నిర్లక్ష్యం చేశాడు ఓ ప్రబుద్ధుడు.పూర్తి వివరాల్లోకి వెళ్తే..వనస్థలిపురం ఎస్కేడీనగర్కు చెందిన ఆలపాటి తులసీదాస్ ఆస్ట్రేలియాలో బీబీఏ చదివి వచ్చాడు. హైదరాబాద్లోనే వ్యాపారం చేస్తూ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.గత ఏడాది బంజారాహిల్స్లో జరిగిన ఓ సమావేశంలో అతడికి ఓ మహిళ పరిచయం అయింది.
ఆమె విబేధాల కారణంగా భర్తతో గత మేలో విడాకులు పొందింది. ఈక్రమంలో తులసీదాస్తో ఆమె పరిచయం ముదిరి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ వ్యవహారంపై తులసీదాస్ భార్య వనస్థలిపురం ఠాణాలో ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేశారు. భార్యపై కక్ష పెంచుకున్న తులసీదాస్ ఆ మహిళతో శృంగారం చేస్తోన్న సమయంలో వీడియోలు తీసి తన భార్యకు పంపించాడు తులసీదాస్.ఇలా వేధింపులు తీవ్రతరం కావడంతో తులసీదాస్ భార్య రాచకొండ సైబర్క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించింది. ఇన్స్పెక్టర్ జలేందర్రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను బుధవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.