వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పై కొనసాగుతున్న అక్రమాస్తుల కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న పలువురి ఐఏఎస్ లకు కోర్టులో ఊరట లభించిన విషయం అందరికీ తెలిసింది. అయితే ఇప్పుడు తాజాగా మరో అధికారికి కోర్టులో ఊరట లభించింది.
ఇప్పుడు ఈ కేసులో మరో ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ కు హైకోర్టులో ఊరట లభించింది. ఆధిత్యనాథ్ మీద మోపిన అభియోగాలను సీబిఐ, ఈడీ నిరూపించలేకపోయాయని, దీంతో ఆధిత్య నాథ్ నిబంధనల ప్రకారమే వ్యవహారించారని కోర్టు స్పష్టం చేసింది.
జగన్ అక్మాస్తుల కేసులో ఆదిత్యనాథ్ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని తెలిపిన కోర్టు ఆయనపై అభియోగాలను మోపే ప్రక్రియను నెలరోజుల పాటు నిలిపేసింది.. దీంతో జగన్ పై మోపిన కేసులన్నీ కూడా కుట్రపూరితంగానే పెట్టిన కేసులే అన్నది తెలిసిందే. ఎందుకంటే అక్రమాస్తులకేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నా అధికారులందరూ కేసులనుంచి బయటపడుతున్నారు. భవిష్యత్తులో జగన్ పై మోపిన అభియోగాలు కూడా ఇదే దారి పడతాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.