అతడు తన జీవనంను ఓ టీ స్టాల్ నడుపుకుంటూ సాగిస్తున్నాడు. ఆమె ఓ పారా మెడికల్ కోర్సు చేస్తోంది. ఇద్దరు ఇష్టపడ్డారు.. ప్రేమించుకున్నారు. శారీరకంగా కూడా ఒక్కటయ్యారు. దాంతో ఆమె గర్భవతి అయ్యింది. పెళ్ళి చేసుకోమని అన్నందుకు ప్రియుడు నో చెప్పాడు.
ప్రియుడిని వదిలించుకోవాలనుకున్న ఆమె ఓ దిమ్మతిరిగే స్కెచ్తో అతడిని అంతమొందించింది. కర్నాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. వివరాలోకి వెళ్తే.. కేరళకు చెందిన మన్సూర్ (27) బెంగళూరుకు వలస వచ్చి సిటీ రైల్వేస్టేషను వద్ద టీ స్టాల్ నడిపేవాడు. మైసూర్ నగరానికి చెందిన శృతి (21) అనే యువతి మెడికల్ కళాశాలలో పారామెడికల్ కోర్సు చేస్తోంది. వారం వారం రైలులో మైసూరుకు వెళ్లి వస్తున్న క్రమంలో మన్సూర్-శృతి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. చివరకు ఆమె గర్భవతి అయింది.
శృతి తనను పెళ్లి చేసుకోవాలని అడగటంతో మన్సూర్ అందుకు ఒప్పుకోలేదు. అబార్షన్ చేయించుకోమని చెప్పాడు. దాంతో కోపం తెచ్చుకున్న శృతి.. మన్సూర్కు మాయమాటలు చెప్పి లాడ్జికి తీసుకెళ్లింది. అక్కడ మన్సూర్కు నిద్రమాత్రలు కలిపిన జ్యూస్ ఇచ్చింది. అతడు నిద్రలోకి వెళ్లాక పెట్రోలు పోసి నిప్పటించింది. మన్సూర్ మంటల్లో కాలి బూడిదయ్యాడు. మన్సూర్ ఆత్మహత్య చేసుకున్నాడని కథ అల్లిన శృతి నిద్రమాత్రలు మింగింది. తర్వాత పోలీసుల విచారణలో ఆమె అసలు వాస్తవాలు అంగీకరించింది. గర్భవతి అయ్యాక తనను పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడనే మన్సూర్ను చంపినట్టు ఆమె ఒప్పుకుంది.
Related