- Advertisement -
విద్యార్ధులకు శుభవార్త. ఈ ఏడాది ఐఐటిల్లో 500 సీట్లు పెరగనున్నాయి. గత సంవత్సరం తిరుపతిలో ప్రారంభించిన ఐఐటి సీట్లతో కలిపి పది వేల సీట్లు ఉన్నాయి. ఈ ఏడాది గోవా, ధార్వాడ్, చత్తీస్గడ్, జమ్ముల్లో కొత్త ఐఐటి కళాశాలలు ప్రారంభం అవుతున్నాయి.
దీంతో ఈ కళాశాలల్లో మరో 500 సీట్లు పెరుగుతాయి. కొత్త కళశాలల్లో ఒక్కో దానిలో వంద నుంచి 120 సీట్ల వరకూ కేంద్రం అనుమతి మంజేరు చేయవచ్చు. ప్రస్తుతం ఖరక్ పూర్ ఐఐటిలో మాత్రమే అత్యధికంగా 1341 సీట్లు ఉన్నాయి. 1090 సీట్లతో వారణాసి ఐఐటి రెండో స్ధానంలో ఉంది. ఐఐటిల్లో సీట్ల కోసం ప్రత్యేక జెఇఇని అడ్వాన్స్ టెస్ట్ ను ఈ నెల 22 వ తేదిన నిర్వహిస్తున్నారు. సీట్ అలాట్మెంట్ ప్రక్రియని జూన్ 22 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.