- Advertisement -
భారత్లో మలేరియా కేసులు, మరణాలు భారీగా తగ్గినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఓ నివేదికలో పేర్కొంది. ఆగ్నేయాసియా దేశాల్లో 2000 సంవత్సరంలో 2 కోట్లుగా ఉన్న మలేరియా బాధితుల సంఖ్య 2019 నాటికి 56 లక్షలకు తగ్గినట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
ప్రపంచ మలేరియా నివేదిక 2020′ పేరిట సోమవారం ఈ వివరాలను విడుదల చేసింది డబ్ల్యూహెచ్ఓ. 2019 నాటికి ప్రపంచవ్యాప్తంగా 22 కోట్ల 9 లక్షల మంది మలేరియా వ్యాధితో బాధపడుతున్నట్లు పేర్కొంది. అయితే గత నాలుగేళ్ల నుంచి గణాంకాల్లో ఎటువంటి మార్పు కనిపించలేదని వివరించింది.
డబ్ల్యూహెచ్ఓ ప్రకారం… 2018 ఏడాదితో పోల్చుకుంటే మలేరియా మరణాల సంఖ్య కాస్త తగ్గింది. 2018లో 4 లక్షల 11 వేల మంది మలేరియా బారిన పడి మృతి చెందగా.. 2019నాటికి ఆ సంఖ్య 4 లక్షల 9 వేలకు తగ్గింది.
Also Read
తప్పుడు లింక్ క్లిక్… సీటు ఫట్..!