Monday, April 29, 2024
- Advertisement -

జ‌గ‌న్ సీఎం అయితే ఇంటలిజెన్స్ చీఫ్ రానున్నసీనియ‌ర్ ఐపీఎస్

- Advertisement -

వైఎస్ జ‌గ‌న్ ఏపీ సీఎం అవుతార‌ని అన్ని స‌ర్వేలు తేల్చేయ‌డంతో కేంద్ర స‌ర్వీసుల‌ నుంచి సీనీయ‌ర్ అధికారులు రాష్ట్రానికి వ‌చ్చేందుకు క్యూ క‌డుతున్నారు. రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్‌గా సీనియ‌ర్ ఐపీఎస్ పిఎస్ఆర్ అధికారి ఆంజనేయులు వ‌చ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి.

1992 బ్యాచ్ ఐపిఎస్ అధికారి అయిన ఆంజనేయులు డిప్యూటేషన్ పై బిఎస్ఎఫ్ ఐజిగా పనిచేస్తున్నారు. రాష్ట్రానికి వెల్లేందుకు ఆయన పెట్టుకున్న విజ్ఢప్తిని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అంగీకరించింది. డిప్యూటేషన్ గడువు పూర్తి కాక ముందే ఆయనను ఎపికి పంపడానికి మే 3వ తేదీన మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

సాధారణంగా డిప్యుటేషన్ పై ఉన్న అధికారిని గడువు ముగియకుండానే మాతృసంస్థకు పంపించడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒక్కటి ఆ అధికారి విన్నవించుకోవడం, రెండోది పాలనాపరమైంది. ఆయన విజ్ఞప్తిపైనే కేంద్ర ప్రభుత్వం తిరిగి ఎపికి పంపిస్తోంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆంజనేయులు నిఘా విభాగం డిఐజిగానూ విజయవాడ పోలీసు కమిషనర్ గానూ పనిచేశారు. 2015లో ఆయ‌న కేంద్ర స‌ర్వీసుల‌కు వెల్లారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే ఆంజనేయులను ఇంటలిజెన్స్ చీఫ్ గా నియమించే అవకాశాలున్నాయనే ప్రచారం సాగుతోంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -