ఏపీలో అధికార టీడీపీ ప్రభుత్వం చేయాల్సిన పనులను ప్రతిపక్షం చేయాల్సి రావడం బాబు దైర్భాగ్య పరిస్థితికి అద్దం పడుతోంది.రైతులు పండించిన మిర్చిపంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంపై వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.రైతన్నలు పడుతున్న కష్టాలను చూసి చలించిపోయిన జగన్ గుంటూరులో రెండు రోజుల పాటు రైతు దీక్ష చేపట్టడంతో కేంద్రంలో కదలిక వచ్చింది.వెంటనే కేంద్ర సర్కార్ మిర్చిపంటకు మద్దతు ధర ప్రకటించింది.
జగన్ దీక్షతో కదిలిన కేంద్రం తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతులు పడుతున్న సమస్యలను అర్థం చేసుకుని స్పందించింది. వారికి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. క్వింటాల్ మిర్చికి రూ.5వేల మద్దతు ధర ప్రకటించింది. అదనపు ఖర్చుల కోసం రూ.1500 అదనంగా ఇస్తామంది. తెలుగు రాష్ట్రాల్లో మిర్చి రైతుల నుంచి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మిర్చి కొనేందుకు కేంద్రం నిర్ణయించింది.
పంటను రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మిర్చి కొనుగోల్లు మే 2 నుంచి మే 31 వరకు కొనుగోళ్లు చేస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్,మరో మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు.
{loadmodule mod_custom,Side Ad 1}
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 88,300 మెట్రిక్ టన్నులు, తెలంగాణలో 33,700 టన్నులు మిర్చిని కేంద్రం కొనుగోలు చేస్తుంది. కొనుగోలు కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఆయా రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయిస్తాయని తెలిపారు.ఏజెన్సీల ద్వారా మిర్చి కొనుగోలు చేసిన మిర్చికి నష్టం వాటిల్లుతే 50-50 భరించాలని తెలిపారు.జగన్ పోరాటానికి కేంద్రం స్పందించడంతో రైతులు జగన్కు కృతజ్ణతలు తెలిపారు. ఏరాష్టరంలోనైనా రైతులు సమస్యలను అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు పరిస్కరించాలి.కానీ ఏపీలో మాత్రం ఇందుకు విరుద్దంగా జరుగుతోంది. అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తోంది.దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న రైతులకోసం జగన్ చేసిన దీక్ష ఫలించింది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేయాల్సిన పనులను …ప్రతిపక్ష వైసీపీ నేత జగన్ చేయడం చూస్తెబ బాబు దాష్టపాలనకు నిదర్వనం.
{youtube}FeY8G7MSAeQ{/youtube}
Related