- Advertisement -
జార్ఖండ్లో ఈ ఉదయం భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. మావోలకు, పోలీసు బలగాలకు జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు హతమవ్వగా, ఓ సీఆర్పీఎఫ్ జవాన్ ప్రాణాలు కోల్పోయాడు. గిరిదిహ్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం సీఆర్పీఎఫ్ దళాలలు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బలగాలు కూబింగ్ నిర్వహిస్తుండగా మావోలు కాల్పులు జరపడంతో సీఆర్పీఎఫ్ దళాలు ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురు నక్సల్స్ హతమయ్యారు.ఘటనా స్థలం నుంచి ఏకే-47 రైఫిల్, నాలుగు పైప్ బాంబులకు సీఆర్పీఎఫ్ జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన మరో జావానును హెలికాప్టర్లో ఆస్పత్రికి తరలించారు.