- Advertisement -
వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అధికార ప్రతినిధి , శాసనమండలి సభ్యుడు జూపూడి ప్రభాకరరావు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు.
గత ఎన్నికలలో కొండపి నుంచి ఆ పార్టీ తరపున పోటీచేసి ఓడిపోయిన జూపూడికి పార్టీ మాజీ మంత్రి బాలి నేని శ్రీనివాసరెడ్డి, ఎమ్.పి వై.వి.సుబ్బారెడ్డితో విబేధాలు ఏర్పడ్డాయి. వారి సహకరించకపోవడం వల్లే తాను ఓడిపోయానని ఆయన కొంతకాలం క్రితం పార్టీ అధ్యక్షుడు జగన్ కు ఫిర్యాదు చేవారు.వారిపై చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు.కాని దానిపై జగన్ స్పందించలేదన్నారు