Thursday, May 16, 2024
- Advertisement -

ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై గ్యాంగ్ రేప్‌…

- Advertisement -

మైసూరులో దారున సంఘ‌ట‌న చోటు చేసుకుంది. ప్రియుడి ఎదుటే ప్రియురాలిపై గ్యాంగ్ రేప్ చేశారు . మద్యం మత్తులో ఆరుగురు కామాంధులు ప్రియుడి ఎదుటే యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మైసూరు నగర శివార్లలోని లింగాంబుధి చెరువు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

వివ‌రాల్లోకి వెల్తే….మైసూరు జిల్లాలోని హెచ్‌డీ.కోటె హ్యాండ్‌ పోస్ట్‌ ప్రాంతానికి చెందిన శివసిద్ధు, అతని ప్రియురాలు కలిసి బుధవారం రాత్రి 10.30 గంటల సమయంలో మైసూరు సమీపంలో ఉన్న లింగాంబుధి చెరువు రింగ్‌ రోడ్డు వద్ద ఏకాంతంగా గ‌డిపేందుకు వెల్లారు. అదే సమయంలో ఆరుగురు యువకులు కారులో అక్కడికి చేరుకున్నారు. మద్యం మత్తులో యువతిని చూసిన ఆ కామాంధులు రెచ్చిపోయారు.

శివసిద్ధు కాళ్ల మీద పెద్ద బండరాయి వెయ్యడంతో తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం వారు యువతిపై మూకుమ్మడిగా అత్యాచారం చేసి పరారయ్యారు. దీనిపై సమాచారం అందుకున్న జయపుర పోలీసులు బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. నిందితుల‌ను ప‌ట్టుకొనేందుకు మూడు బృందాల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -