- Advertisement -
దివంగత కరుణానిధి అంత్యక్రియలు చెన్నైలోని మెరీనా బీచ్ వద్ద ఈ సాయంత్రం 5 గంటలకు జరగనున్నాయి. అంత్యక్రియలకు ఏర్పాట్లను అధికారులు ఆగమేఘాల మీద చేపడుతున్నారు. మరోవైపు, డీఎంకే అభిమానులు భారీ ఎత్తున బీచ్ వద్దకు చేరుకుంటున్నారు. భారీ సంఖ్యలో జనాలు అక్కడకు చేరుకుంటుండటంతో భద్రతను కట్టు దిట్టం చేస్తున్నారు. మెరీనా బీచ్ వద్ద కేంద్రం సైన్యాన్ని దింపింది. రాజాజి హాల్ నుంచి సాయంత్రం 4 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. సైనిక వాహనాలు క్రమంగా అక్కడకు చేరుకుంటున్నాయి.