Sunday, May 5, 2024
- Advertisement -

నన్ను అరెస్ట్ చేస్తే కేసిఆర్ సర్కార్‌కు అదే ఆఖరి రోజు : చంద్రబాబు

- Advertisement -

ఓటుకు నోటు వ్యవహారం తెలుగు రాష్ట్రాల మధ్య బాగా ముదిరిపోయింది. ఈ వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ స్థాయికి చేరింది. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఓ జాతీయ ఛానల్‌తో మాట్లాడారు. నన్ను అరెస్ట్ చేస్తే కేసిఆర్ ప్రభుత్వానికి అదే ఆఖరి రోజు అని సవాలు విసిరారు. నేను ఎక్కడెక్కడో మాట్లాడింది తీసుకొచ్చి జత కలిపి కుట్ర చేస్తున్నారని కేసిఆర్ పై మండి పడ్డారు.

వాళ్ళు కుట్ర చేసి వాళ్ళ సొంత ఛానల్‌ లో ప్రసారం చేశారు. దానికి నేను సమాధానం ఎందుకు చెప్పాలి. మా ఎమ్మెల్యేలను ఆకర్షించి వాళ్ళ పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి కూడా ఇచ్చారు. మరి ఇది ఎలా చేశారు. ఇది అవినీతి కాదా అని అన్నారు. నాకు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ముఖ్యం కాదు. నీతి, సిద్దాంతం ముఖ్యమని అన్నారు. 

మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఓటుకు నోటు వ్యవహారం మీద తన మిత్ర పక్ష పార్టీ అయిన బిజెపి నేతలను కలిసి ఈ వ్యవహారాన్ని వివరించి బయట పడాలనుకుంటున్నారని సమాచారం. అందులో భాగంగానే ప్రధాన మంత్రి మోదీని, రాష్ట్రపతిని, బిజెపి ప్రెసిడెంట్ అమిత్‌షా ని కలిసి హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి గవర్నర్‌కు లా అండ్ ఆర్డర్  ఇవ్వాలని కోరనున్నారని సమాచారం.    

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -