Saturday, April 27, 2024
- Advertisement -

కరోనా వల్ల.. ఫోన్ లో చూస్తూ పెళ్లి చేసుకున్నాడు (వీడియో)

- Advertisement -

కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో లాక్ డౌన్ విధించారు. దాంతో ఎక్కడున్న వారు అక్కడే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో వివాహా శుభకార్యలు పెట్టుకున్నవారు వాయిదా వేసుకున్నారు. చాలా పెళ్లిలు ఆగిపోయాయి. కొన్ని వివాహలు మాత్రం ఎలాంటి హంగు, ఆర్భాటాలు లేకుండా జరుగుతున్నాయి. ఇంట్లోనే పెళ్లిలు చేసుకుంటున్నారు.

బంధువులను పిలవకుండా ఓ పది మంది ముఖ్య వ్యక్తుల సమక్షంలో పెళ్లిలు చేసుకుంటున్నారు. గ్రాండ్ గా చేసుకోవాలి అనుకున్నవారు పెళ్లిలను వాయిదా వేసుకుంటున్నారు. మరికొందరు వినూత్నంగా ఆలోచించి, ఉన్న చోటునే ఉండి, పెళ్లి తంతును ముగించేసుకుంటున్నారు. అలాంటిదే ఇప్పుడు జరిగింది. వీడియో కాల్ లో వధువును చూస్తూ, ఆ స్మార్ట్ ఫోన్ కే మూడు ముళ్ళూ వేసేశాడు ఓ యువకుడు.

ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళలో ఈ వివాహం జరిగినట్టు తెలుస్తోంది. స్మార్ట్ ఫోన్ ను ఓ యువకుడు పట్టుకుని వుండగా, వధువును చూస్తూ, స్మార్ట్ ఫోన్ కు వరుడు తాళి కడుతూ ఉంటే.. అక్కడ ఓ మహిళ, వధువు మెడలో తాళి కట్టేసింది. దీంతో పెళ్లి తంతు ముగిసింది. అయితే కొందరు అనుకున్న టైంకి పెళ్లి జరగాలి కాబట్టి ఇలా చేశారు అంటున్నారు. ఇక ఆ వీడియోని మీరూ చూడండి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -