నగ్న చిత్రాలను బయటపెడతానంటూ టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని జూబ్లీహిల్స్కు చెందిన సుంకర సుజాత చేసిన ఫిర్యాదు మేరకు నామాపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈనెల 23న నామా అతని బ్రదర్ తో తన ఇంటికి వచ్చి బెదిరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సుజాత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో నిందితులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు కూడా వచ్చాయి. దీనితో నామా ,తమ్ముడు సీతయ్యలపై ఐపీసీ 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా నామాతో ఈమె జరిపిన సంభాషణలకు సంబంధించిన ఆడియో క్లిప్ను కూడా ఆమె మీడియాకి ఇచ్చారు.
ఇదంతా ఒకలా ఉంటే నామా నాగేశ్వరరావు అతి త్వరలో టీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారంటూ వస్తోన్న వార్తల నేపథ్యంలో ఈ యవ్వారం టిపాలిటిక్స్లో చాలా హాట్గా మారిపోయింది. మంత్రి తుమ్మల నాగేశ్వరావే ఇదంతా కావాలనే సుజాత ద్వారా నామా మీద ఈ రకంగా ఎటాక్ చేస్తున్నారంటూ రాజకీయ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.