Wednesday, May 15, 2024
- Advertisement -

మరో వివాదంలో సోనియా కుటుంబం

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కుటుంబం మరో వివాదంలో చిక్కుకుంది. తన అల్లుడు, ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు లండన్ లో బినామీ బంగ్లా ఉన్నట్లుగా బయటపడింది. దీని విలువ అక్షరాలా 19 కోట్ల రూపాయలు. ఆయుధాల వ్యాపారి నుంచి వాద్రా దీనిని కానుకగా తీసుకున్నట్లుగా బయటపడింది. ఆ వ్యాపారి ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు చేసిన దాడుల్లో కొన్ని ఈ మె‍యిళ్లు వెలుగుచూసాయి.

వీటిలో వాద్రా బినామీ ఇంటి గురించి కూడా ఉండడంతో అధికారులు అవాక్కయ్యారు. ఆయుధ వ్యాపారి అయిన సంజయ్ భండారి బ్రియాన్ స్టన్ స్క్వేర్ లోని 12 ఎలర్టన్ హౌస్ ను వాద్రా స్వాధీనం చేసుకున్నారడానికి ఆదాయ శాఖ అధికారులకు పక్కా ఆధారాలు లభించాయి. 2009 అక్టోబర్ లో 19 కోట్ల రూపాయలకు ఈ భవనాన్ని కొనుగోలు చేసి 2010 సంవత్సరం జూన్ లో దాన్ని విక్రయించినట్లు పత్రాల్లో వెలువడింది.  

ఐటి అధికారులు చేసిన దాడుల్లో ఈ ఇంటికి సంబంధించిన మరమ్మతులు, క్రయవిక్రయాలకు సంబంధించిన అన్ని ఈమెయిళ్లు బయటపడ్డాయి. అధికారులు దాడి చేసిన సమయంలో భండారి తన వద్ద ఉన్న బ్లాక్ బెర్రి ఫోన్ ను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. అయితే అధికారులు మాత్రం ఆ ఫోన్ ను స్వాధీనం చేసుకుని దానిలోని ఈమెయిళ్లు, ఇతర ముఖ్యమైన సమాచారాన్ని రాబట్టగలిగారు.   

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -