Monday, May 6, 2024
- Advertisement -

మమతా బెనర్జీ ఇంట విషాదం!

- Advertisement -

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంట్లో విషాదం నెలకొంది. గత కొన్ని రొజులుగా బెంగాల్ లో కరోనా కేసులు అమాంతం పెరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న ఒక్కరోజే బెంగాల్ లో 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 136 మంది మృతి చెందారు. తాజాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోదరుడు ఆషిమ్ బెనర్జీ కరోనా కారణంగా మృతి చెందారు.

ఈ మద్యనే ఆషీమ్ కరోనా భారిన పడటంతో అతన్ని కోలకతా లోని మెడికా ఆస్పత్రిలో చేర్చి వైద్యం అందించారు. అయితే ఇవాళ ఆయన పరిస్థితి విషమించడంతో ఆషీమ్ బెనర్జీ మృతి చెందారు. దీంతో సిఎం మమతా బెనర్జీ ఇంట విషాదం నెలకొంది. మరోవైపు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంట కూడా విషాదం నెలకొంది. పన్నీర్ సెల్వం సోదరుడు బాలమురుగన్ మృతి చెందారు.

ఆయన వయసు 55 సంవత్సరాలు. బాలమురుగన్ మృతి పట్ల ముఖ్యమంత్రి స్టాలిన్ సంతాపం వ్యక్తం చేశారు. కాగా వెస్ట్ బెంగాల్ లో గడిచిన 24 గంటల్లో 20,846 కొత్త కరోనా కేసులు నమోదవగా 136 మంది మృతి చెందారు. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10, 94,802 కు చేరగా 12,993 కరోనా మరణాలు సంభవించాయి.

‘వకీల్ సాబ్’ కథ ముందుగా ఆ హీరోకే వినిపించారట.. కానీ

రామ్ చరణ్ ఫస్ట్ లవర్ ఎవరో తెలుసా?

ఎంపీ రఘురామకృష్ణంరాజు కి షాక్ ఇచ్చిన హై కోర్టు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -