Saturday, April 27, 2024
- Advertisement -

మంత్రి అల్లుడు అరెస్ట్.. మలుపు తిరుగుతున్న కేసు..?

- Advertisement -

మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఇటీవల వెలుగు చూసిన డ్రగ్స్​ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్​సీబీ). బుధవారం రాత్రి ముంబయిలో ఎన్​సీబీకి చెందిన పలు బృందాలు తనిఖీలు నిర్వహించాయి.

ఈ కేసుతో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న మహారాష్ట్ర మంత్రి, ఎన్​సీపీ నేత నవాబ్​ మాలిక్​ అల్లుడు సమీర్​ ఖాన్​ను బుధవారం అరెస్ట్​ చేసింది ఎన్​సీబీ. ఈ కేసుకు సంబంధించి వారం క్రితం అరెస్టయిన బ్రిటన్​ వ్యక్తి కరణ్​ సంజ్నాని సహా మరో ఇద్దరితో రూ.20వేల ఆన్​లైన్​ లావాదేవీలు జరిపినట్లు గుర్తించిన ఎన్​సీబీ ఇప్పటికే తాఖీదులు ఇచ్చింది. ఈ క్రమంలో బుధవారం సమీర్​ ఖాన్​ను ప్రశ్నించిన అనంతరం అరెస్ట్​ చేసింది.
తన అల్లుడు సమీర్​ ఖాన్​ అరెస్ట్​పై స్పందిస్తూ.. చట్టానికి ఎవరూ అతీతులు కాదన్నారు రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల శాఖ​ మంత్రి నవాబ్​ మాలిక్​. ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టం అమలు కావాలన్నారు. చట్టం తనపని తాను చేసుకుంటుందని పేర్కొంటూ ట్వీట్​ చేశారు. న్యాయవ్యస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -