ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కోడలు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ భార్య చిన్నపాటి ప్రమాదానికి గురయ్యారు. ఆమెకు కళ్లు తిరగడం వల్ల ఒక్కసారే తుళ్లి పడటంతో చేతికి గాయం జరిగింది దీంతో ఆమెను వెంటనే అపోలో ఆసుపత్రిలో చేర్చారు. బ్రాహ్మణి ప్రమాదానికి గురయ్యారన్న వార్త ఒక్కసారిగా తెలియడంతో టీడీపీ వర్గాలు ఆందోళన చెందాయి.
వాస్తవానికి ఇది పెద్ద గాయం కాకపోయినా ప్రమాదం జరిగిందని తెలుసుకు న్న బాబు స్వయంగా గంట సేపు పైనే ఆసుపత్రిలో ఉండి వైద్యులతో తదేకంగా బ్రహ్మణి ఆరోగ్య పరిస్థితి పై వివారాలు అడిగి తెలుసుకోవడం. బాలయ్య సైతం కంగారు ఆసుపత్రికి చేరుకోవడం చూసి అభిమానులు కంగారు పడిపోయారు చివరికి విషయం తెలుసుకున్నాక ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. బ్రాహ్మణి ఆరోగ్యానికి ఏ విధమైన డోకా లేదని, త్వరలోనే ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేస్తామని వైద్యులు చెబుతున్నారు.