- Advertisement -
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమ కుటుంబ ఆస్తుల సంబంధించిన వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు. వరుసగా ఆరేళ్ల నుంచి చంద్రబాబు కుటుంబం ఆస్తులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే లోకేష్ తన భార్య బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్ ఆస్తుల వివరాలను సైతం వెల్లడించారు. బ్రాహ్మణి, దేవాన్ష్ ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి.
బ్రాహ్మణి ఆస్తుల వివరాలు :
– మాదాపూర్లో భూమి- రూ.17లక్షలు
– జూబ్లీహిల్స్లో నివాసం- రూ.3.50కోట్లు
– చెన్నైలో వాణిజ్య స్థలం రూ.48లక్షలు
– మణికొండలో స్థలం విలువ- రూ.1.23కోట్లు
దేవాన్ష్ ఆస్తుల వివరాలు :
– జూబ్లీహిల్స్లో ఇంటి విలువ- రూ.9.17కోట్లు
– ఫిక్స్డ్ డిపాజిట్లు రూ.2.4కోట్లు
– నగదు నిల్వ రూ.2.31 లక్షలు
Related