Thursday, March 28, 2024
- Advertisement -

టాలీవుడ్ డ్రగ్స్ కేసు లో కీలక మలుపు

- Advertisement -

అప్పుడెప్పుడో తెలుగు సినిమా పరిశ్రమ మీద డ్రగ్స్ అభియోగం మోపబడింది. అన్నట్లు గా నే చాలా మంది సినిమా పరిశ్రమ కి సంబందించిన పెద్దల ని, యువ హీరోలని, హీరోయిన్లని విచారణ కి కూడా పిలిచారు. రవి తేజ వంటి హీరోల దగ్గర నుండి పూరి వంటి దర్శకుల వరకు చాలా మంది నే విచారించింది ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్. ఇప్పుడు కొత్తగా ఈ డ్రగ్స్ కేసులో నాలుగు 4 చార్జిషీట్ల ని సిట్ దాఖలు చేసినట్టు సమాచారం. అయితే వివాదాస్పద అంశం ఏంటి అంటే ఈ చార్జిషీట్లలో 62 మంది పేర్లు కానరావడంలేదు.

ఇంతకు ముందు ఇదే కేసులో 62 మంది హీరో, హీరోయిన్స్, దర్శకులు, సినీ తారగణంలోని ప్రముఖులనుండి గోర్లు, వెంట్రుకల నమూనాలను సేకరించి న సిట్ ఇప్పుడు తాజాగా ఈ టాలీవుడ్ నటుల పేర్ల ను చార్జిషీట్లలో చేర్చలేదు. ఏదో తూ తూ మంత్రంగా చార్జిషీట్ల తయారు చేశారు అనే అభియోగాలని మోస్తుంది ఇప్పుడు. ఇంతకు ముందు దాఖలైన చార్జిషీట్ల లో ఉన్న సినీ సెలబ్రెటీలకు క్లీన్ చిట్ ఇచ్చిన సిట్ ఇప్పుడు మాత్రం కేవలం నలుగురి మీద నే ఈ ఛార్జ్ షీట్ పెట్టింది. ఈ నాల్గింటిలో ఒకటి సౌత్ ఆఫ్రికా పౌరుడు రఫెల్ అలెక్స్ విక్టర్. మరో ముగ్గురు ఎవరు అని తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -