Wednesday, May 1, 2024
- Advertisement -

ఇటలీలో జన్మించిన కొత్త వైరస్ ఇప్పుడు.. పాకిస్థాన్ లో..!

- Advertisement -

బ్రిటన్​లో వెలుగుచూసిన కొత్త రకం కరోనా వైరస్​ ఆనవాళ్లను ఇటలీలో కూడా బయటపడ్డాయి. తాజాగా ఈ కొత్త వైరస్​కు సంబంధించి ఓ కేసును గుర్తించినట్లు అక్కడి వైద్యశాఖ తెలిపింది. రోగి, తన జీవిత భాగస్వామితో కలిసి బ్రిటన్ నుంచి ఇటీవలే వచ్చినట్టు పేర్కొంది. వారిని ఐసోలేషన్​లో ఉంచినట్లు వెల్లడించింది.

ఇప్పటివరకు ఇటలీలో 19.53 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వ్యాప్తి వల్ల తొలినాళ్లల్లోనే ఇటలీ తీవ్రంగా దెబ్బతింది. ఓ దశలో కరోనాకు హాట్​స్పాట్​గా మారింది. రోజుకు వేలల్లో కరోనా మరణాలు నమోదయ్యాయి. ఇప్పటికీ రోజుకు 15 వేల కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై సర్వత్రా ఆందోళన నెలకొంది.

బ్రిటన్​లో కొత్త రకం కరోనా కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. బుధవారం నుంచి నమోదైన కేసుల్లో 60 శాతం కంటే ఎక్కువే ఈ కొత్ తరకం వైరస్‌ను గుర్తించినట్లు బ్రిటన్ అధికారులు చెబుతున్నారు. సాధారణ వైరస్​తో పోలిస్తే కొత్తరకం కరోనా 70 శాతం ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందుతోందన్నారు. ఈ వైరస్‌ను వాక్సిన్‌ నిరోధిస్తుందని చెప్పడానికి ఆధారాలు లేవని అధికారులు ప్రాథమికంగా నిర్ధరించడం ఆందోళన కలిగిస్తోంది. వైరస్ మరింత ప్రమాదకరంగా ఉంటుందా లేదా అన్న విషయంపైనా స్పష్టత లేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -