Monday, May 6, 2024
- Advertisement -

రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టొద్దు.. ఆదేశాలు జారీ..!

- Advertisement -

రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టొద్దని ఎన్జీటీ చెన్నై బెంచ్ పునరుద్ఘాటించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని ఆదేశించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ వాసి గవినోళ్ల శ్రీనివాస్ వేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్​పై ఎన్జీటీ విచారించింది.

పనులు జరుపుతున్నారని ఎన్జీటీ దృష్టికి పిటిషనర్ తీసుకెళ్లారు. సమాధానం ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఎన్జీటీ ఆదేశించింది. పనులపై నిజనిర్ధరణకు కమిటీ వేయాలన్న తెలంగాణ వినతిపై వివరణ ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -