- Advertisement -
ఒడిశా గవర్నర్ గణేశీ లాల్ భార్య సుశీలా దేవి కరోనా బారిన పడి మృతి చెందారు. నవంబర్ 1న గవర్నర్ కటుంబ సభ్యులకు సోకగా భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రి సుశీలా దేవి ఆరోగ్య పరిస్థితి విషమించగా కన్నుమూశారు.
ఒడిశా ప్రథమ మృతి పట్ల గవర్నర్ కుటుంబ సభ్యులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం తెలిపారు. భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు జయ్ పాండా ట్విట్టర్ వేదికగా ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఒడిశాలో మరో 638 మందికి వైరస్ సోకగా.. మెుత్తం బాధితుల సంఖ్య 3,13,961కు చేరింది. కొత్తగా 15 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 1640కి పెరిగింది.
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోని కి పాజిటివ్..!
48 గంటలు మాజీ ముఖ్యమంత్రి ఆరోగ్యం కీలకం..!