అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయి(84) ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టు సమాచారం. మూత్రపిండాల పనితీరు మెరుగయ్యేందుకు సుమారు 6 గంటలపాటు డయాలసిస్ చేసినా.. ఆరోగ్య స్థితిలో మాత్రం ఏ మార్పులు కనిపించలేదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
అయితే.. వెంటిలేషన్పై ఉన్న ఆయనకు సోమవారం మరోసారి డయాలసిస్ నిర్వహించనున్నట్టు చెప్పారు మంత్రి. అంతవరకూ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలించనున్నట్టు వెల్లడించారు శర్మ.
తరుణ్ గొగొయి ఆగస్టు 25న కరోనా బారినపడ్డారు. వైరస్ నుంచి కోలుకున్న అనంతరం.. అనారోగ్య సమస్యలతో ఈ నెల 2న గువాహటి మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో చేరారు. అయితే.. గత ఆదివారం(22వ తేదీ) ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈ నేపథ్యంలో రాబోయే 48 గంటలు కీలకమని వైద్య వర్గాలు ప్రకటించాయి.
లైంగిక సామర్థ్యం లో క్రూరత్వం..!
మరణంతో పోరాడుతున్న మాజీ ముఖ్యమంత్రి..!