Saturday, April 27, 2024
- Advertisement -

భారత వాయుసేన చేసే విన్యాసాలు మెరుగు పరిచేందుకు మాత్రమే..!

- Advertisement -

రానున్న నెలల్లో తూర్పు లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దూకుడు ప్రదర్శించే అవకాశముందన్న వార్తలపై భారత వాయుసేన సారథి ఆర్​కేఎస్ భదౌరియా స్పందించారు. దూకుడుగా ఉండటం తమకు కూడా వచ్చన్నారు. లద్దాఖ్​లోని వాస్తవాధీన రేఖ వెంబడి చైనా దుశ్చర్యలకు పాల్పడాలని చూస్తే తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇందుకోసం సంసిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

రాజస్థాన్​లోని జోధ్​పూర్​లో డెసర్ట్​ నైట్​-21 పేరుతో భారత- ఫ్రెంచ్​ వైమానిక దళాలు సంయుక్తంగా చేస్తోన్న విన్యాసాల సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు భదౌరియా.అయితే రాజస్థాన్​లో చేస్తోన్న వైమానిక విన్యాసాలను తూర్పులద్దాఖ్​లో కూడా చేస్తారా?అని ప్రశ్నించగా , అలాంటి దేమీ లేదన్నారు. భారత్​, ఫ్రాన్స్​ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడడానికే ఇలాంటి విన్యాసాలను చేపడుతున్నామని స్పష్టం చేశారు. ద్వైపాక్షిక సంబంధాల దృష్ట్యా చేసే ఈ విన్యాసాలు మరో దేశానికి వ్యతిరేకంగా చేస్తున్నవి కావని అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -