Monday, May 6, 2024
- Advertisement -

ఎమ్ ఎల్ ఏ గారు ఎంత పనిచేశారండి…

- Advertisement -

ప్రజా ప్రతినిదులు ఏం చేసినా పద్దతిగా ఉండాలి. ఎలా పడితే అలా చేసేస్తామంటే కుదరదు.కాని జార్ఖండ్ లోని జేఎంఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే సైమన్ మరాండీ వెస్ర్టన్ కల్చర్‌ మోజులో చేయరాని తప్పే చేశాడు. రాజధాని రాంచీకి 300 కిలోమీటర్లు.. పకూర్ జిల్లాలోని దుమారియా విలేజ్‌లో ట్రైబల్ జంటల ముద్దుల పోటీ నిర్వహించారు. ఈ కాంటెస్ట్‌కి 18 మంది పెళ్లైన జంటలు హాజరయ్యాయి. ఎక్కువ సేపు ముద్దు పెట్టుకున్న జంటకు బహుమతి ఇచ్చేశారు. ఈ పోటీలను చూసేందుకు వేలాదిమంది తరలివచ్చారు.

ఈ పోటీలు ఎందుకు పెట్టారు సారు అని అడిగితే.. ఆ ఎమ్మెల్యే గారు….. ట్రైబల్స్ నార్మల్‌గా అమాయకులని, చదువులు కూడా అంతంత మాత్రమేగానే వుండడంతో వాళ్ల ఫ్యామిలీ సిస్టమ్ బలహీనంగా వుంటుంన్నాయని…దీనికి తోడు ఈ మధ్యకాలంలో భార్యభర్తల మధ్య విభేదాలొచ్చి డైవోర్స్ కేసులు తెగ పెరుగుతున్న నేపథ్యంలో ఈ తరహా కాంటెస్ట్ పెడితే అది వాళ్ల మధ్య మరింత ప్రేమను పెంచుతోందని చెబుతున్నారు. మొత్తానికి ఎమ్మెల్యే తాను చేసిన పనిని సమర్ధించుకునే ప్రయత్నం చేశారు. కాని ఎమ్మెల్యే వ్యవహారంపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి. ఎప్పుడూ లేని ఈ విష సంస్కృతి ఏంటంటూ విమర్శలు గుప్పిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -