Monday, April 29, 2024
- Advertisement -

పాక్ డ్రోన్ కూల్చివేత‌…స‌రిహ‌ద్దుల్లో హైఅల‌ర్ట్‌..

- Advertisement -

బాలాకోఠ్‌పై భార‌త్ దాడి జ‌రిగి చాలా రోజులు అవుతున్నా స‌రిహద్దుల్లో ప‌రిస్థితులు ఉద్రిక్తంగానె ఉన్నాయి. పాకిస్థాన్ ప‌దే ప‌దే కాల్పుల‌కు పాల్ప‌డుతూ నిబంధ‌న‌ల‌ను ఉల్లంగిస్తున్న పాక్ మ‌రో ప‌క్క భార‌త స‌రిహ‌ద్దుల్లోకి డ్రోన్‌ల‌ను పంపుతూ ఉద్రిక్త ప‌రిస్థితుల‌ను రెచ్చ‌గొడుతోంది. తాజాగా పాక్ కు చెందిన మ‌రో డ్రోన్‌ను భార‌త ద‌ళాలు కూల్చివేశాయి. పంజాబ్‌లోని ఖేమ్‌ కరన్‌ సెక్టార్‌లో కనిపించిన పాకిస్తాన్‌ డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్‌ బలగాలు కూల్చివేశాయి.ఈ నేపథ్యంలో, సరిహద్దు ప్రాంతాల్లో హైలర్ట్ ను ప్రకటించారు.

పంజాబ్‌ సరిహద్దులోని రటోక్‌ గ్రామంలో పాక్‌ డ్రోన్‌ను గుర్తించిన బీఎస్‌ఎఫ్‌ దళాలు యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ గన్‌తో కూల్చివేశారు. కూల్చిన డ్రోన్ పాక్ భూబాగంలో ప‌డిందా లేక పాక్ భూబాగంలో ప‌డిందా అన్న‌దానిపై క్లారిటీ రావాల్సింది. భారత జవాన్లు డ్రోన్‌పై కాల్పులకు దిగిన ఘటనను తాను చూశానని రటోక్‌ సర్పంచ్‌ లక్బీర్‌ సింగ్‌ చెప్పారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -