నెల్లూరు, కడప, అనంతపురం జిల్లాల్లో పలు గ్రామాల్లో ఇవాళ పంచాయతీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జిల్లా చేజర్ల, మర్రిపాడు మండలాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గతంలో జరగాల్సిన ఎన్నికలు పలు కారణాల వల్ల వాయిదా పడ్డాయి. చేజర్ల మండలం వావిలేరు, మైపాటివారి కండ్రిక… మర్రిపాడు మండలం కంపసముద్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు.
కడప జిల్లా వేంపల్లె మండలం టి.వెలమవారిపల్లెలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. గత ఎన్నికల సమయంలో అభ్యర్థులు లేక ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు… బందోబస్తు చర్యలు తీసుకున్నారు.
పెద్దవడూగురు మండలం రావులుడికి పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అభ్యర్థి మృతి కారణంగా గతంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం 3.30 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని అధికారులు వెల్లడించారు. కేంద్రాల వద్ద పోలీసులు గస్తీ కాస్తున్నారు.
వైసిపి కి అందుకే ఓట్లు వేశారు : పవన్ కళ్యాణ్..!